ఓటు నమోదు కేంద్రాల తనిఖీ

ABN , First Publish Date - 2020-12-14T04:28:14+05:30 IST

మండలంలో ఏర్పాటు చేసిన ఓటు నమోదు కేంద్రాలను ఆత్మకూరు ఆర్డీవో సువర్ణమ్మ ఆదివారం తనిఖీ చేశారు. మొదట

ఓటు నమోదు కేంద్రాల తనిఖీ
ఓటు నమోదు కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఆర్డీవో సువర్ణమ్మ

సంగం, డిసెంబరు 13: మండలంలో ఏర్పాటు చేసిన ఓటు నమోదు కేంద్రాలను ఆత్మకూరు ఆర్డీవో సువర్ణమ్మ ఆదివారం తనిఖీ చేశారు. మొదట సంగం ఉన్నత పాఠశాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేశారు. స్వీకరించిన దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిద్దీపురంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లోపాలు లేకుండా నిబంధనల మేరకు అర్హత కలిగిన వారికి మాత్రమే ఓటు నమోదుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దారు నిర్మలానందబాబా ఉన్నారు. 

Updated Date - 2020-12-14T04:28:14+05:30 IST