ఆర్టీసీలోనూ వైరస్
ABN , First Publish Date - 2020-07-08T11:08:45+05:30 IST
ఆర్టీసీని మెల్లమెల్లగా కరోనా ఆక్రమిస్తోంది. నెల్లూరు-1వ డిపోలో ఇద్దరు అధికారులకు పాజిటివ్ రావడంతో కార్మికులు తీవ్ర
1, 2 డిపోలలో 12 పాజిటివ్ కేసులు
కార్మికుల ఆందోళన.. బస్సులకు బ్రేక్
మధ్యాహ్నం తర్వాత రాకపోకలు
నెల్లూరు (స్టోన్హౌస్పేట), జూలై 7 : ఆర్టీసీని మెల్లమెల్లగా కరోనా ఆక్రమిస్తోంది. నెల్లూరు-1వ డిపోలో ఇద్దరు అధికారులకు పాజిటివ్ రావడంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో మంగళవారం కార్మికులు నిరసనకు దిగడంతో ఆర్టీసీ ప్రఽధాన బస్టాండు నుంచి మధ్యాహ్నం వరకు బస్సులు నడవలేదు. చివరకు అధికారులు నచ్చజెప్పడంతో బస్సులు నడిచాయి. ఇక 2వ డిపో పరిధిలో పది మంది సిబ్బందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇంకా ఫలితాలు వెల్లడికావాల్సి ఉండటంతో ఇటు అధికారులు, అటు కార్మికులలో ఆందోళన నెలకొంది.