నేటి నుంచి పరీక్షలు ప్రారంభం

ABN , First Publish Date - 2020-09-14T10:24:35+05:30 IST

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ పీజీ, డిగ్రీ కళాశాలల్లో సోమవారం పరీక్షలు ప్రారంభం కానున్నాయని ..

నేటి నుంచి  పరీక్షలు ప్రారంభం

వీఎ్‌సయూ పరీక్షల నియంత్రణాధికారి సాయిప్రసాద్‌రెడ్డి


వెంకటాచలం, సెప్టెంబరు 13 : విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ పీజీ, డిగ్రీ కళాశాలల్లో సోమవారం పరీక్షలు ప్రారంభం కానున్నాయని వీఎ్‌సయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ సాయిప్రసాద్‌రెడ్డి తెలిపారు. పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సు పరీక్షలను మాత్రం రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. కాకుటూరు వద్ద ఉన్న వీఎ్‌సయూ క్యాంపస్‌, కావలి పీజీ సెంటర్లలో ఉన్న పీజీ కోర్సులకు సంబంధించి ఈనెల 14 నుంచి 18వ తేది వరకు మొదటి విడతలో కొన్ని అదనపు పీజీ కోర్సులకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.


ఈనెల 28 నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు రెండో విడతలో పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సుల పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. ఈనెల 16 నుంచి 23వ తేదీ వరకు డిగ్రీ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపారు.  జిల్లా వ్యాప్తంగా 45 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షల సమయం, హల్‌టిక్కెట్లు తదితర  వివరాల కోసం వీఎ్‌సయూ వెబ్‌సైట్‌ను పరివీలించుకోవచ్చని, పూర్తి వివరాలకు ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. 

Updated Date - 2020-09-14T10:24:35+05:30 IST