చంద్రబాబు సవాల్కు సిద్ధమా?
ABN , First Publish Date - 2020-08-05T11:28:30+05:30 IST
అమరావతి అంశంపై తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ను స్వీకరించే దమ్ము వైసీపీ ..
మంత్రి అనిల్ రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి
టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద
నెల్లూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : అమరావతి అంశంపై తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేసిన సవాల్ను స్వీకరించే దమ్ము వైసీపీ నాయకులకుందా? అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఆయనతోపాటు వైసీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల్లోకి వెళ్తే వారి మద్దతు ఎవరికో తెలుస్తుందన్నారు. మంగళవారం నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్లో బీద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుల, మత, అవినీతి అంటూ అమరావతిని రాజధాని కాకుండా చేశారని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిసహా ప్రతి వైసీపీ నాయకుడు అమరావతికి మద్దతు పలికారని, అభివృద్ధి చేస్తామని నమ్మించి ఇప్పుడు మోసం చేశారని దుయ్యబట్టారు. వైసీపీ నాయకులు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
మంత్రి అనిల్కుమార్ యాదవ్ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే నెల్లూరు ప్రజల అభిప్రాయం ఏమిటో తెలుస్తుందన్నారు. రాష్ట్ర మొత్తం కాకపోయినా నెల్లూరు జిల్లాలోనైనా తేల్చుకుందామా అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేశారని రవిచంద్ర కొనియాడారు. ఈ సమావేశంలో టీడీపీ నగర ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నాయకులు మాలేపాటి సుబ్బానాయుడు, జెన్ని రమణయ్య, మలిశెట్టి వెంకటేశ్వర్లు, కొండూరు పాలిశెట్టి పాల్గొన్నారు.