గరుడుడిపై పెంచలస్వామి దర్శనం
ABN , First Publish Date - 2020-12-12T04:37:51+05:30 IST
పెంచలకోన క్షేత్రంలో స్వాతీ నక్షత్రం సందర్భంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
రాపూరు, డిసెంబరు 11: పెంచలకోన క్షేత్రంలో స్వాతీ నక్షత్రం సందర్భంగా శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీవారికి అభిషేకం చేసి, సుందరంగా అలంకరించారు. కల్యాణమండపంలో శాంతిహోమం నిర్వహించి, శ్రీవారిని గరుడ వాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.