వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-11-22T04:10:50+05:30 IST

మండలంలోని మంగళపూరు మార్గంలో ఇందిరమ్మ కాలనీ సమీపంలో శనివారం ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వ్యక్తి ఆత్మహత్య

గూడూరు(రూరల్‌), నవంబరు 21: మండలంలోని మంగళపూరు మార్గంలో ఇందిరమ్మ కాలనీ సమీపంలో శనివారం ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య  చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు.... తమిళనాడు రాష్ట్రంలోని నాగర్‌కోయిల్‌కు చెందిన పెరుమాళ్‌ప్రభు(40) కొన్నేళ్లుగా స్థానిక జానకిరాంపేటలో నివసిస్తూ, ఫైనాన్స్‌ వ్యాపారం చేసేవాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రూరల్‌ ఎస్‌ఐ పుల్లారావు కేసు  దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-11-22T04:10:50+05:30 IST