డిసెంబరు 24న రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌

ABN , First Publish Date - 2020-11-22T04:31:26+05:30 IST

మండలంలోని ఓగూరువాండ్లపల్లిలో డిసెంబరు 24వ తేదీన రాష్ట్రస్థాయి గెలాక్సీ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు జీపీఎల్‌ కమిటీ చైౖర్మన్‌ గంధం వెంకటయ్య, కార్యదర్శి సోడా చిన్నపరెడ్డి తెలిపారు.

డిసెంబరు 24న రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌
గోడపత్రిక ఆవిష్కరిస్తున్న జీపీఎల్‌ కమిటీ సభ్యులు

గోడపత్రిక ఆవిష్కరించిన నిర్వాహకులు                                        

సీతారామపురం, నవంబరు 21: మండలంలోని ఓగూరువాండ్లపల్లిలో డిసెంబరు 24వ తేదీన రాష్ట్రస్థాయి గెలాక్సీ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు జీపీఎల్‌ కమిటీ చైౖర్మన్‌ గంధం వెంకటయ్య, కార్యదర్శి సోడా చిన్నపరెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం ఓగూరువాండ్లపల్లిలో గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల సహాయార్థం రాష్ట్రస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తామన్నారు. జనవరి 10వ తేదీన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌, జనవరి 14న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్‌లో విజేతలకు ప్రథమ బహుమతి రూ.లక్ష, ద్వితీయ బహుమతి రూ.25,000, తృతీయ బహుమతి రూ.10,000, మ్యాన్‌ ఆఫ్‌ ద సీరీస్‌ రూ.5,000, మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌కు రూ.500 అందిస్తామన్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనదలచిన జట్లు ఎంట్రీ ఫీజు రూ.3,000 ఈ నెల 30వ తేదీలోపు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 7210000672, 7210000762 అను నెంబర్లను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు హరీ్‌షరెడ్డి, అల్లూరురెడ్డి, మధు, దత్తాత్రేయ, ప్రసాద్‌, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-22T04:31:26+05:30 IST