రూ.80వేల గుట్కాల స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-12T04:53:58+05:30 IST

గుట్కా విక్రయాలపై ఎస్‌ఈబీ అధికారులు శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆటోనగర్‌లోని సిక్కులవారివీధిలో రెండు గుట్కా విక్రయ కేంద్రాలపై దాడులు చేసి ఖలీల్‌, సల్మాన్‌ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

రూ.80వేల గుట్కాల స్వాధీనం

నెల్లూరు(క్రైం), డిసెంబరు 11: గుట్కా విక్రయాలపై ఎస్‌ఈబీ అధికారులు శుక్రవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆటోనగర్‌లోని సిక్కులవారివీధిలో రెండు గుట్కా విక్రయ కేంద్రాలపై దాడులు చేసి ఖలీల్‌, సల్మాన్‌ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 80 వేల విలువ చేసే గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడైనా నిషేధిత పొగాకు ఉత్పత్తుల నిల్వలు, విక్రయాలు జరుగుతుంటే ప్రజలు తమకు సమాచారం అందించాలని ఎస్‌ఈబీ అధికారులు కోరారు.

Updated Date - 2020-12-12T04:53:58+05:30 IST