సత్యశోధన గ్రంథ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2020-12-31T03:57:45+05:30 IST

శ్రీహరికోట స్పేస్‌ సెంటర్‌ స్కూల్‌ హిందీ ఉపాధ్యాయుడు మిమిక్రీ, వెంట్రిలాక్విజం కళాకారుడు ఐనాపురపు రామలింగేశ్వరరావు అనువదించిన సత్యశోధన అనే గ్రంథాన్ని బుధవారం భారత పిరమిడ్‌పార్టీకి చెందిన బ్రహ్మశ్రీ సుభాష్‌ పత్రిజీ అవిష్కరించారు.

సత్యశోధన గ్రంథ ఆవిష్కరణ
గ్రంథాన్ని ఆవిష్కరిస్తున్న బ్రహ్మశ్రీ సుభాష్‌ పత్రిజీ

సూళ్లూరుపేట, డిసెంబరు 30 : శ్రీహరికోట స్పేస్‌ సెంటర్‌ స్కూల్‌ హిందీ ఉపాధ్యాయుడు మిమిక్రీ, వెంట్రిలాక్విజం కళాకారుడు ఐనాపురపు రామలింగేశ్వరరావు అనువదించిన సత్యశోధన అనే గ్రంథాన్ని బుధవారం భారత పిరమిడ్‌పార్టీకి చెందిన బ్రహ్మశ్రీ సుభాష్‌ పత్రిజీ అవిష్కరించారు. హైదారాబాదులో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా ధ్యాన మహాచక్రం కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరిగింది. షార్‌కు చెందిన డాక్టర్‌ నాగవేణిశంకర్‌ తెలుగులో రచించిన సత్యశోధన గ్రంథాన్ని ఐనాపురపు రామలింగేశ్వరరావు హిందీలోకి అనువదించి ప్రచురించారు. విక్రీశాట్‌ విశ్రాంత శాస్త్రవేత్త ఆవంచ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.  షార్‌ శాస్త్రవేత్తలు, రచయితలు,  కళాకారులు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2020-12-31T03:57:45+05:30 IST