సరస్వతీ సమాజం అధ్యక్షుడి మృతి

ABN , First Publish Date - 2020-12-20T05:00:30+05:30 IST

నెల్లూరు మూలాపేటలోని సర్వసతీ సమాజం అధ్యక్షుడు, కవి వల్లూరు రామమోహన్‌ (65) శనివారం మృతి చెందారు.

సరస్వతీ సమాజం అధ్యక్షుడి మృతి
రామమోహన్‌రావు (ఫైల్‌)

సరస్వతీ సమాజం అధ్యక్షుడి మృతి

నెల్లూరు సాంస్కృతిక ప్రతినిధి, డిసెంబరు 19 : నెల్లూరు మూలాపేటలోని సర్వసతీ సమాజం అధ్యక్షుడు, కవి వల్లూరు రామమోహన్‌ (65) శనివారం మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వీఆర్‌ కళాశాల విశ్రాంత ఉపన్యాసకులు కళావతి ఆయన అర్ధాంగి.   వారికి ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు ఉన్నారు. వారు విదేశాల నుంచి రావలసి ఉన్నందున సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి ఆ సంస్థ నిర్వాహకులు టి.రమణయ్య, మోపూరు వేణుగోపాలయ్య  తదితరులు సంతాపం తెలిపారు.


Updated Date - 2020-12-20T05:00:30+05:30 IST