ఉద్యమంలో రైతులు అంతర్భాగం కావాలి

ABN , First Publish Date - 2020-12-31T05:07:38+05:30 IST

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతు చట్టాలకు నిరసనగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంలో అందరు రైతులు అంతర్భావం కావాలని రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు.

ఉద్యమంలో రైతులు అంతర్భాగం కావాలి
దీక్ష చేస్తున్న రైతు సంఘాలు

 దీక్షలో రైతు సంఘం నేతలు 


నెల్లూరు (వైద్యం), డిసెంబరు 30 : కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతు చట్టాలకు నిరసనగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంలో అందరు రైతులు అంతర్భావం కావాలని రైతు సంఘం నేతలు పిలుపునిచ్చారు. బుధవారం రైతు సంఘాలు నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండు వద్ద దీక్ష చేపట్టారు. ఏపీ రైతు సంఘం నేతలు మాట్లాడుతూ ఆ చట్టాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. కరోనా కాలంలోనూ వ్యవసాయ రంగం దేశానికి అండగా నిలిచిందన్నారు. అటువంటి రంగాన్ని అంబానీ, ఆదాని, ఐటీసీ, పెప్సీ వంటి కంపెనీలకు అప్పగించేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశానికి పాలు, పండ్లు, కూరగాయలు, నూనె గింజలు, ఆహార ధాన్యాలు, పూలు అందించే కర్షకుల మెడకు ఉరితాళ్లు బిగించేలా  నూతన చట్టాలు ఉన్నాయని విమర్శించారు. రైతు ఉద్యమం నేపథ్యంలో గ్రామాల్లో దీక్ష శిబిరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, వెంగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకమరాజు, పుల్లయ్య, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోపాల్‌, జిల్లా కార్యదర్శి లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T05:07:38+05:30 IST