రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN , First Publish Date - 2020-11-16T02:42:48+05:30 IST
వరగలి క్రాస్రోడ్డు సమీపంలో శనివారం వేకువన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.

చిల్లకూరు, నవంబరు 15: వరగలి క్రాస్రోడ్డు సమీపంలో శనివారం వేకువన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. నల్గొండ జిలా మిర్యాలగూడకు చెందిన నవీన్(27) సపోటా పండ్ల లోడుతో టాటామ్యాజిక్ వాహనంలో తిరుపతికి వెళుతుండగా, వాహనం వరగలి క్రాస్రోడ్డు సమీపంలో అదుపుతప్పి ముందు వెళుతున్న లారీని ఢీకొంది. ఈ సంఘటనలో నవీన్ అక్కడికక్కడే మృతిచెందాడు. టాటామ్యాజిక్ డ్రైవర్ లతీఫ్కు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.