మరో రెండు..70కి చేరిన పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-04-25T09:43:19+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గినట్లే తగ్గి మరలా పెరుగుతున్నాయి.

మరో రెండు..70కి చేరిన పాజిటివ్‌ కేసులు

నెల్లూరు(వైద్యం)ఏప్రిల్‌ 24 : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గినట్లే తగ్గి మరలా పెరుగుతున్నాయి. శుక్రవారం మరో రెండు కేసులు నమోదయ్యాయి. నెల్లూరుకు చెందిన ఒకరికి, కోవూరుకు చెందిన మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కోవూరులో ఒక వ్యక్తికి వారం క్రితం కరోనా వైరస్‌ సోకగా ప్రస్తుతం ఆయన భార్యకు కూడా పాజిటివ్‌ వచ్చింది. వారిద్దరు ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక నెల్లూరు నగరంలో ఢిల్లీ కాంటాక్టు ఒకరికి పాజిటివ్‌ నమోదయింది. దీంతో జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 70కి చేరింది. ఇప్పటివరకు 8 మంది డిశ్చార్జికాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. జిల్లా వ్యాప్తంగా కరోనా అనుమానితుల నుంచి పెద్ద ఎత్తున నమూనాలను సేకరిస్తున్నారు.

Updated Date - 2020-04-25T09:43:19+05:30 IST