93.17 శాతం పింఛన్ల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-02T04:33:23+05:30 IST

సామాజిక పింఛన్ల పంపిణీ మంగళవారం ప్రారంభమైంది.

93.17 శాతం పింఛన్ల పంపిణీ

నెల్లూరు(హరనాథఫురం), డిసెంబరు 1 : సామాజిక పింఛన్ల పంపిణీ మంగళవారం ప్రారంభమైంది. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 93.17 శాతం పెన్షన్‌ పంపిణీ జరిగింది. వరదల నేపథ్యంలో మూడు రోజులపాటు ఈ పంపిణీ జరగనుంది. ప్రతిరోజూ వలంటీర్లు ఉదయం 6 గంటలకే ఇంటింటికి  వెళ్లి లబ్ధిదారులకు పింఛను అందజేస్తారు. మొత్తం 3,67,640 మందికి రూ. 91.11 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. 

Updated Date - 2020-12-02T04:33:23+05:30 IST