నెల్లూరురూరల్‌ మండలం పెద్దచెరుకూరులో సందడి చేసిన పాయల్‌ రాజ్‌పుత్

ABN , First Publish Date - 2020-12-01T16:42:29+05:30 IST

‘ఆర్‌ఎక్స్‌ 100’ నటీమణి పాయల్‌ రాజ్‌పుత్‌ సోమవారం నెల్లూరురూరల్..

నెల్లూరురూరల్‌ మండలం పెద్దచెరుకూరులో సందడి చేసిన పాయల్‌ రాజ్‌పుత్

నెల్లూరు: ‘ఆర్‌ఎక్స్‌ 100’ నటీమణి పాయల్‌ రాజ్‌పుత్‌ సోమవారం నెల్లూరురూరల్‌ మండలం పెద్దచెరుకూరులో సందడి చేశారు. ఇక్కడున్న గంగాబాలత్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయానికి చేరుకుని కార్తీక దీపం వెలిగించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు పవన్‌కుమార్‌రెడ్డి నివాసంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న అభిమానులతో తన సినిమాలు ఏవేవి చూశారంటూ తెలుగులో మాట్లాడారు. కరోనా మహమ్మారితో అందరం పోరాడుతున్నందున తన సినిమాలను ఆహా, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి యాప్‌లో చూడాలని కోరారు. వైసీపీ రూరల్‌ ఇన్‌చార్జి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌ మురళీమోహన్‌రెడ్డి, నాయకులు రాజారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T16:42:29+05:30 IST