టీసీలు ఇవ్వని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు
ABN , First Publish Date - 2020-11-03T09:54:36+05:30 IST
ప్రభుత్వ పాఠశాల ల్లో చేరాలనుకునే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల యాజ మాన్యాలు టీసీలు ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని డీఈవో పిల్లి రమేష్ హెచ్చరించారు.
డీఈవో పిల్లి రమేష్ ఫ నాడు నేడు పనుల పరిశీలన
కావలిటౌన్/కావలి రూరల్, నవంబరు 2: ప్రభుత్వ పాఠశాల ల్లో చేరాలనుకునే విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల యాజ మాన్యాలు టీసీలు ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని డీఈవో పిల్లి రమేష్ హెచ్చరించారు. సోమవారం ఆయన కావలి పట్టణం, రూరల్ మండ లంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. రూరల్ మం డలం సిరిపురం ప్రాథమికోన్నత పాఠశాల, సర్వాయపాలెం ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ టీసీలు ఇవ్వని ప్రైవేట్ పాఠశాల యాజమా న్యాలపై చర్యలు తీసుకోవాలని జిల్లాలోని ఎంఈవోలకు స్పస్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రస్తుతానికి టీసీలు ఇవ్వకపోయినా అడ్మి షన్లు ఇస్తున్నామని తెలిపారు. అధిక ఫీజులు కట్టి ప్రైవేట్ పాఠశా లల్లో చేరడం కన్నా అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చేర డం మంచిదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే సమగ్ర విద్యా బోధన సాధ్యమని పేర్కొన్నారు. అర్హులైన ఉపాధ్యాయులు, ఆట స్థలాలు కలిగి ఉచితంగా పుస్తకాలు, సమదుస్తులు ఇస్తున్నారన్నారు. ఆయన వెంట ఎంఈవో శ్రీధర్, హెచ్ఎంలు ఉన్నారు.