కరోనాపై స్వీయ జాగ్రత్తలు పాటించాలి
ABN , First Publish Date - 2020-11-01T11:21:26+05:30 IST
కరోనా మహమ్మారి బారిన పడకుండా ఎవరికి వారు స్వీయరక్షణ చర్యలు తీసుకోవాలని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ) వైస్ చాన్సలర్ రొక్కం సుదర్శనరావు సూచించారు.
వీఎస్యూ వైస్ చాన్సలర్ రొక్కం సుదర్శనరావు
వర్సిటీలో అవగాహన ర్యాలీ ప్రారంభం
వెంకటాచలం, అక్టోబరు 31 : కరోనా మహమ్మారి బారిన పడకుండా ఎవరికి వారు స్వీయరక్షణ చర్యలు తీసుకోవాలని విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్యూ) వైస్ చాన్సలర్ రొక్కం సుదర్శనరావు సూచించారు. కాకుటూరు వద్ద యూనివర్సిటీలో శనివారం కరోనా అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. వీఎస్యూ పరిపాలన భవనం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఎస్యూలో ప్రతిఒక్కరూ భౌతిక దూరం, మాస్కులు ధరించడం, శానిటైజర్ల వినియోగం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఎస్యూ రెక్టార్ ఎం.చంద్రయ్య, రిజిస్ర్టార్ డాక్టర్ లేబాకు విజయకృష్ణారెడ్డి, వీఎస్యూ కళాశాల ప్రిన్సిపాల్ నాయర్, పరీక్షల నిర్వాహణాధికారి డాక్టర్ సీఎస్ సాయిప్రసాద్రెడ్డి, పీజీ సెట్ కన్వీనర్ డాక్టర్ టీ వీరారెడ్డి, అసిస్టెంట్ రిజిస్ర్టార్ డాక్టర్ జీ సుజయ్కుమార్, ప్రోగ్రామ్ సమన్వయకర్తలు డాక్టర్ ఎం.హనుమారెడ్డి, మేరి సందీప, పీఆర్వో డాక్టర్ నీలమణికంఠ తదితరులు పాల్గొన్నారు.