భక్తి శ్రద్ధలతో కంబల్ ఫాతెహా
ABN , First Publish Date - 2020-10-27T07:17:54+05:30 IST
కసుమూరు మస్తాన్ వలీ దర్గాలో అదివారం రాత్రి కంబల్ ఫాతెహా (దుప్పట్ల పండుగ )ను ఘనంగా నిర్వహించారు.
వెంకటాచలం, అక్టోబరు 26 : కసుమూరు మస్తాన్ వలీ దర్గాలో అదివారం రాత్రి కంబల్ ఫాతెహా (దుప్పట్ల పండుగ )ను ఘనంగా నిర్వహించారు. దర్గాలో ప్రతి ఏటా గంధమహోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి 20 రోజుల ముందు దర్గాలో కంబల్ ఫాతెహా నిర్వహించడం ఆనవాయితీ. మస్తాన్ వలీ సమాధిపై ఉన్న పాత దుప్పట్లను తొలగించి కొత్త దుప్పట్లను కప్పడాన్నే కంబల్ ఫాతెహాగా వ్యవహరిస్తారు. కరోనా నేపథ్యంలో వక్ఫ్బోర్డు అధికారులు, స్థానికంగా పలు శాఖల అధికారులు, పోలీసులు కట్టుది ట్టమైన చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో దర్గా ముజావర్లు ఆసిఫ్, కరీముల్లా, సులేమాన్, హనిఫ్, ఆరీఫ్, మున్వర్, మౌలన, యూసుఫ్, రియాజ్, మొహ్మద్, దస్తగీర్, లియాఖత్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.