పెన్నా పరివాహక ప్రజలను అప్రమత్తం చేయాలి
ABN , First Publish Date - 2020-09-27T10:19:27+05:30 IST
మండలంలోని పెన్నా పరివాహక లోతట్టు ప్రాంతాల జనాన్ని అప్రమత్తం చేయాలని ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులు, గ్రామ వలంటీర్లను శనివారం తహసీల్దారు షఫీమాలిక్ హెచ్చరించారు.
బుచ్చిరెడ్డిపాళెం, సెప్టెంబరు 26: మండలంలోని పెన్నా పరివాహక లోతట్టు ప్రాంతాల జనాన్ని అప్రమత్తం చేయాలని ఆయా గ్రామాల రెవెన్యూ అధికారులు, గ్రామ వలంటీర్లను శనివారం తహసీల్దారు షఫీమాలిక్ హెచ్చరించారు. సోమశిల జలాశయం నుంచి దిగువ పెన్నానదికి వరద ప్రవాహం వస్తుందని చెప్పారు. జొన్నవాడ, శ్రీరంగరాజపురం, దామరమడుగు గ్రామాల లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.