రైల్వే స్టేషన్లో లిఫ్టు సౌకర్యం కల్పించండి
ABN , First Publish Date - 2020-09-23T09:17:40+05:30 IST
సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో వృద్ధులు, పిల్లల సౌకర్యార్థం లిఫ్టు సౌకర్యం కల్పించాలని దక్షిణ రైల్వే ఏడీఆర్ఎం మనోజ్కు స్థానిక బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు.
సూళ్లూరుపేట, సెప్టెంబరు 22 : సూళ్లూరుపేట రైల్వే స్టేషన్లో వృద్ధులు, పిల్లల సౌకర్యార్థం లిఫ్టు సౌకర్యం కల్పించాలని దక్షిణ రైల్వే ఏడీఆర్ఎం మనోజ్కు స్థానిక బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. స్థానిక రైల్వే స్టేషన్లో మంగళవారం ఆయన్ను శాలువాతో సత్కరించారు. చెన్నైనుంచి సూళ్లూరుపేట వరకు నడుపుతున్న మోము రైళ్లను నాయుడుపేట వరు పొడిగించాలని కోరారు.
కోటపోలూరు మార్గంలో నిర్మిస్తున్న అండర్ బ్రిడ్జి త్వరగా పూర్తిచేయాలని, అక్కడ వర్షపు నీరు నిలవకుండా చూడాలని కోరారు. బీజేపీ సీనియర్ నేత ఇమ్మానేని చెన్నకేశవరావు, భైరి పార్థసా రధి, తాడిపర్తి ఆదినారాయణ, బూరగ మనోహర్, కామిరెడ్డి సోమశేఖర్రెడ్డి పాల్గొన్నారు.