కోటంరెడ్డి పీఏపై దాడి...తొడగొట్టి సవాల్ విసిరిన టీడీపీ నేత

ABN , First Publish Date - 2020-11-03T18:05:12+05:30 IST

టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హౌస్ ఫర్ ఆల్ ఇళ్ల ముట్టడికి లబ్ధిదారులు యత్నించారు. తమ ఇళ్లు తమకు కేటాయించాలని టీడీపీ నగర ఇన్‌చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు

కోటంరెడ్డి పీఏపై దాడి...తొడగొట్టి సవాల్ విసిరిన టీడీపీ నేత

నెల్లూరు: టీడీపీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ హౌస్ ఫర్ ఆల్ ఇళ్ల ముట్టడికి లబ్ధిదారులు యత్నించారు. తమ ఇళ్లు తమకు కేటాయించాలని టీడీపీ నగర ఇన్‌చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి పీఏపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారుు. విషయం తెలిసిన వెంటనే టీడీపీ కార్యకర్తలు ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడి చేసిన వాళ్ళు దమ్ముంటే ఇప్పుడు రావాంటూ కోటంరెడ్డి తొడకొట్టి సవాలు విసిరారు. పిరికి పందల్లా ఎవరూలేనప్పుడు దాడి చేయడం సరికాదని హెచ్చరించారు. 

Updated Date - 2020-11-03T18:05:12+05:30 IST