:నాడు-నేడు పనులు సత్వరం పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2020-12-31T03:36:41+05:30 IST
నాడు-నేడు పథకం కింద జరుగుతున్న పాఠశాలల అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని డీఈవో రమేష్ ఆదేశించారు. ముత్తుకూరులో బుధవారం ఆయన పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణ పనులను ప
![:నాడు-నేడు పనులు సత్వరం పూర్తి చేయాలి](https://media.andhrajyothy.com/appimg/galleries/2020123010044114/12302020220513n15.jpg)
ముత్తుకూరు, డిసెంబరు30: నాడు-నేడు పథకం కింద జరుగుతున్న పాఠశాలల అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని డీఈవో రమేష్ ఆదేశించారు. ముత్తుకూరులో బుధవారం ఆయన పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 15వ తేదీ నాటికి నాడు-నేడు పనులు పూర్తి కావాలన్నారు. ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యాంశాల అభ్యసన తీరు, విద్యార్థుల సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశమై, విద్యాపరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంఈవో మధుసూదన, ప్రధానోపాధ్యాయులు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు.