కాలువలోని మృతదేహానిది హత్యే : సీఐ
ABN , First Publish Date - 2020-12-16T02:31:06+05:30 IST
మండలంలోని తాటిపర్తి సమీపంలోని నెల్లూరు కాలువలో పోలీసులు గుర్తించిన మృతదేహానిది
పొదలకూరు, డిసెంబరు 15 : మండలంలోని తాటిపర్తి సమీపంలోని నెల్లూరు కాలువలో పోలీసులు గుర్తించిన మృతదేహానిది హత్యేనని పొదలకూరు సీఐ జి.గంగాధర్రావు మంగళవారం పేర్కొన్నారు. మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టానికి పంపారు. మృతదేహన్ని పరిశీలించిన తర్వాత మరణించిన వ్యక్తి చేతులు వెనుకకు తిప్పి కట్టివేసి ఉండటంతో అనుమానాస్పద మృతిని హత్య కేసుగా మార్చామని తెలిపారు. మృతదేహం ఎక్కువ రోజులు నీటిలో ఉండటం వలన గుర్తు పట్టలేనివిధంగా తయారైంది. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటాయని,, కాఫీ రంగు గళ్ల చొక్కా, వంగపువ్వు రంగు లుంగీ ధరించి ఉన్నాడని, చేతికి ఆంజనేయస్వామి డాలర్ ధరించి ఉన్నారని సీఐ తెలిపారు. ఆనవాళ్లు గుర్తించిన వారు స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. ఈ కేసును సవాల్గా తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -----------