సచివాలయ భవనాల రంగు మార్పు
ABN , First Publish Date - 2020-05-10T07:35:04+05:30 IST
Municipality on Saturday to light the 13 secretariat buildings in town
![సచివాలయ భవనాల రంగు మార్పు](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హడావిడిగా పనులు
నాయుడుపేట టౌన్, మే 9 : పట్టణంలోని ఉన్న 13 సచివాలయ భవనాలకు తెలుపురంగును వేసేందుకు శనివారం మున్సిపల్శాఖ అధికారులు హడావిడిగా పనులు ప్రారంభించారు. ఒక్కో భవనానికి రూ. 30 నుంచి రూ. 40 వేల వరకు తెలుపురంగు వేసేందుకు నగదును ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుందని మున్సిపాలిటీ ఇంజనీరింగ్శాఖ అధి కారులు తెలిపారు. కాగా మండలంలో ఉన్న 11 సచివాలయ భవనాలకు తెలుపురంగు వేసే పనులను ఇంకా ప్రారంభించలేదు. పైఅధికారుల నుంచి అనుమతులు రాలేదని ఎంపీడీవో తెలిపారు.