సమ్మె జయప్రదం చేయండి : సీఐటీయూ
ABN , First Publish Date - 2020-08-04T11:04:35+05:30 IST
మున్సిపల్ కార్మికులను రెగ్యుల ర్ చేయాలంటూ మంగళవారం చేపట్టే సమ్మెను జయప్రదం చేయాలని ..
నెల్లూరు(వైద్యం)ఆగస్టు 3 : మున్సిపల్ కార్మికులను రెగ్యుల ర్ చేయాలంటూ మంగళవారం చేపట్టే సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ నేతలు కోరారు. సోమవారం నగరంలోని 21, 22, 23 మస్టర్ కేంద్రాల వద్ద వారు నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నేత అల్లాడి గోపాల్, బాష, అనిల్, కిన్నెరకుమార్లు మాట్లాడారు. గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాదయాత్ర లోనూ ఇదే చెప్పారని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇంత వరకు వీరి గురించి పట్టించుకోకపోవటం దుర్మార్గమన్నారు. కరోనా విసత్కర పరిస్థితిలో మున్సిపల్ కార్మికులు ప్రాణాలు సైతం ఫణంగా పెట్టి పారిశుధ్య పనులు చేపడుతున్నార న్నారు. వీరిని రెగ్యులర్ చేయాలంటూ మంగళవారం సమ్మెను చేపడతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐటీయూ నేతలు కార్మికులు పాల్గొన్నారు.