సచివాలయాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం
ABN , First Publish Date - 2020-11-14T03:18:28+05:30 IST
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతోపాటు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు చేర్చేందుకు గ్రామసచివాలయాలు చర్యలు తీసుకుంటాయని ఎమ్మెల్యే వరప్రసాద్రావు అన్నారు.
చిల్లకూరు, నవంబరు 13: ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతోపాటు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు చేర్చేందుకు గ్రామసచివాలయాలు చర్యలు తీసుకుంటాయని ఎమ్మెల్యే వరప్రసాద్రావు అన్నారు. శుక్రవారం ఏరూరు, చింతవరం గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అన్నంరెడ్డి పరంధామరెడ్డి, మన్నెం శ్రీనివాసులు, చేవూరు నాగరాజు, ఎద్దల మధుసూదన్రెడ్డి, దువ్వూరు చిరంజీవిరెడ్డి, దువ్వూరు దిలీప్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
==