పారిశుధ్యం మెరుగుకు చర్యలు
ABN , First Publish Date - 2020-04-01T11:08:11+05:30 IST
పట్టణంలో పారిశుధ్యం మెరుగుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు తెలిపారు. మంగళవారం

గూడూరు(రూరల్), మార్చి 31: పట్టణంలో పారిశుధ్యం మెరుగుకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు తెలిపారు. మంగళవారం స్థానిక టవర్క్లాక్ కేంద్రం వద్ద ట్యాంకర్ల ద్వారా బ్లీచింగ్ నీటిని రోడ్లపై పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్యం మెరుగుకు పట్టణంలోని అన్ని ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా బ్లీచింగ్ నీటిని పిచికారీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ దశరఽథరామారావు, సునీల్రెడ్డి, సతీష్రెడ్డి, చంద్రనీల్ తదితరులు పాల్గొన్నారు.