లేఅవుట్లను పరిశీలించిన అధికారులు
ABN , First Publish Date - 2020-12-18T02:35:43+05:30 IST
మండలంలోని నాగరాజుతోపులో ఏర్పాటు చేసిన లేఅవుట్ను గురువారం అధికారులు

ఇందుకూరుపేట, డిసెంబరు 17 : మండలంలోని నాగరాజుతోపులో ఏర్పాటు చేసిన లేఅవుట్ను గురువారం అధికారులు పరిశీలించారు. ఈనెల 25న ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించి గ్రామ స్థాయి సిబ్బందికి పలు సూచనలు అందచేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దారు నాగరాజుతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.