కోనలో కడప జిల్లా భక్తులు
ABN , First Publish Date - 2020-12-29T04:07:54+05:30 IST
పెంచలకోన క్షేత్రం మరోసారి గోవింద, పెంచల నామస్మరణలతో మార్మోగింది.
పెంచల నామస్మరణతో మార్మోగిన కోన
రాపూరు, డిసెంబరు 28: పెంచలకోన క్షేత్రం మరోసారి గోవింద, పెంచల నామస్మరణలతో మార్మోగింది. కడప జిల్లా పుల్లంపేటకు చెందిన సుమారు 200 మంది భక్తులు పెంచలస్వామి మాల ధరించి, ఇరుముళ్లు నెత్తినపెట్టుకుని కాలినడకన సోమవారం క్షేత్రానికి చేరుకున్నారు. ఇరుముళ్లు సమర్పించుకుని శ్రీవార్లను దర్శించుకున్నారు. భజనలు, కోలాటాలతో సందడి సందడి చేశారు.