జనవరి 15 నాటికి నాడు-నేడు పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-12-30T02:27:36+05:30 IST

: మండలంలోని అన్ని పాఠశాలల్లో నాడు-నేడు పనులు జనవరి 15వతేదీకల్లా పూర్తి చేయాలని ఎంఈవో ధిలీప్‌కుమార్‌ హెచ్‌ఎంలను ఆదేశించారు. మంగళవారం బుచ్చి ఎంపీడీవో ఈఈ ఆనంద్‌రెడ్డి, డీఈ రాధాకృష్ణ, ఏఈ మ

జనవరి 15 నాటికి నాడు-నేడు పనులు పూర్తి చేయాలి
హెచ్‌ఎంలతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఈఈ, డీఈ. ఏఈ, ఎంఈవో

 ఎంఈవో దిలీప్‌కుమార్‌

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు29: మండలంలోని అన్ని పాఠశాలల్లో నాడు-నేడు పనులు జనవరి 15వతేదీకల్లా పూర్తి చేయాలని ఎంఈవో ధిలీప్‌కుమార్‌ హెచ్‌ఎంలను ఆదేశించారు. మంగళవారం బుచ్చి ఎంపీడీవో  ఈఈ ఆనంద్‌రెడ్డి, డీఈ రాధాకృష్ణ, ఏఈ మహేంద్రలతో కలిసి ఎంఈవో  హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన నాడు- నేడు  పనులు చివరిదశకు వచ్చాయన్నారు. పాఠశాలల్లో పనులకు ముందుగా తీసిపెట్టిన పాత ఫొటోలు, పనులు పూర్తయిన తరువాత కొత్త ఫొటోలను తీసి ఓ ఆల్బమ్‌ను తయారు చేయాలని తెలిపారు. బాగా పనులు చేసుకున్న ఉపాధ్యాయులు పీపీటీ ప్రజెంటేషన్‌ సిద్ధం చేయాలన్నారు. తద్వారా సమాజంలో నాటి పాఠశాలల తీరును, నేటి అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మండలంలోని ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T02:27:36+05:30 IST