నష్టపోయిన రైతులకు తక్షణ సాయమందించాలి
ABN , First Publish Date - 2020-12-08T02:33:19+05:30 IST
తుఫాన్ కారణంగా మండలంలో నీటమునిగి నారుమళ్లు, వరినాట్లు, మెట్టపైర్లు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం వెంటనే తక్షణ సా

బుచ్చిరెడ్డిపాళెం,డిసెంబరు7: తుఫాన్ కారణంగా మండలంలో నీటమునిగి నారుమళ్లు, వరినాట్లు, మెట్టపైర్లు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం వెంటనే తక్షణ సాయమందించాలని మండల జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం బుచ్చి తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తుఫాన్తో నష్టపోయిన రైతాంగం కష్టాలు తెలుసుకునేందుకు తమ పార్టీ అధ్యక్షుడు జిల్లాలో పర్యటించారన్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరగా స్పందించకపోవడంతో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జైకిసాన్ నినాదంతో చేపట్టే రా ష్ట్ర వ్యాప్త దీక్షలో భాగంగా సోమవారం బుచ్చి మండలంలో రైతాంగానికి ప్రభుత్వం తక్షణ సాయమందించాలని ఈ కార్యక్రమం చేపట్ట్టినట్లు తెలిపారు. ఈ మేరకు తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ముందుగా బుచ్చిలోని జొన్నవాడ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రైతుల సమస్యలపై నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు ప్రసాద్, నాయకులు సునీల్, శ్రీను, జయరాం, చైతన్య, సుధీర్, సాయితోపాటు పలువురు జనసైనికులు పాల్గొన్నారు.---