పవన్‌కల్యాణ్‌ పర్యటనకు తరలిరండి

ABN , First Publish Date - 2020-12-02T04:21:45+05:30 IST

నివర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 4,5 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని, పవన్‌ అభిమానులు, జనసేన ఇన్‌చార్జులు, నాయకులు, జనసైనికులు తరలిరావాలని ఆ పార్టీ నాయకుడు గునుకుల కిషోర్‌ పిలుపునిచ్చారు.

పవన్‌కల్యాణ్‌ పర్యటనకు తరలిరండి
మాట్లాడుతున్న కిషోర్‌

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), డిసెంబరు 1: నివర్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 4,5 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారని, పవన్‌ అభిమానులు, జనసేన ఇన్‌చార్జులు, నాయకులు, జనసైనికులు తరలిరావాలని ఆ పార్టీ నాయకుడు గునుకుల కిషోర్‌ పిలుపునిచ్చారు. నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 4వ తేదీ ఉదయం 10.30 గంటలకు నాయడుపేట చేరుకుంటారని, మధ్యాహ్నం 12 గంటలకు గూడూరులో పర్యటించి 3 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారన్నారు. 5వ తేదీ ఉదయం 9 గంటలకు నగరంలో విలేకర్ల సమావేశంలో పాల్గొంటారని, 11 గంటలకు రాపూరుకు చేరుకుని రైతులను పరామర్శించి, మధ్యాహానం 1 గంటకు వెంకటగిరికి చేరుకుంటారని, అక్కడి నుంచి రేణుగుంటకు వెళతారన్నారు. ఈ సమావేశంలో సుజయ్‌బాబు, కొట్టే వెంకటేశ్వర్లు, శ్రీనివాసులురెడ్డి, డాక్టర్‌ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T04:21:45+05:30 IST