60,867 మందికి రూ.60.86 కోట్లు

ABN , First Publish Date - 2020-11-26T04:47:51+05:30 IST

జగనన్న తోడు పథకం ద్వారా బుధవారం జిల్లాలో 60,867 మందికి రూ.60.86 కోట్లు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి.

60,867 మందికి రూ.60.86 కోట్లు
వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు, అధికారులు

 ‘జగనన్నతోడు’ పథకం ద్వారా లబ్ధి

నెల్లూరు(హరనాథపురం), నవంబరు 25 : జగనన్న తోడు పథకం ద్వారా బుధవారం జిల్లాలో 60,867 మందికి రూ.60.86 కోట్లు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని ప్రారంభించగా, నెల్లూరు జడ్పీ డీఈఓసీ నుంచి కలెక్టర్‌ చక్రధర్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సున్నా వడ్డీకే ఈ పథకం ద్వారా రూ.10వేల రుణం అందచేశారు.   ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీఏ పీడీ నాగలక్ష్మి, జడ్పీ సీఈఓ సుశీల తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-26T04:47:51+05:30 IST