ప్రభుత్వ సర్వీసులన్నీ ఈ-సేవ ద్వారానే..

ABN , First Publish Date - 2020-11-14T03:47:54+05:30 IST

ప్రభుత్వ సర్వీసులన్నీ సచివాలయాల్లోని ఇ-సేవ ద్వారానే నిర్వహించాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు సచివాలయ సిబ్బందికి సూచించారు.

ప్రభుత్వ సర్వీసులన్నీ ఈ-సేవ ద్వారానే..
కేసీఎన్‌గుంట సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ చక్రధర్‌బాబు

కలెక్టర్‌ చక్రధర్‌బాబు 

సూళ్లూరుపేట, నవంబరు 13 : ప్రభుత్వ సర్వీసులన్నీ సచివాలయాల్లోని ఈ-సేవ ద్వారానే నిర్వహించాలని కలెక్టర్‌ చక్రధర్‌బాబు సచివాలయ సిబ్బందికి సూచించారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని కేసీఎన్‌గుంట సచివాలయాన్ని కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్‌ కుటుంబ సమేతంగా  షార్‌కు వెళ్లి తిరుగుముఖంలో ఈ సచివాలయాన్ని సందర్శించారు.  రికార్డులను పరిశీలించారు. రోజు ఎంతమంది ప్రజలు తమ పనుల కోసం వస్తారని సిబ్బందిని వాకబుచేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనిచేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దారు కన్నంబాక రవికుమార్‌, ఎంపీడీవో నర్మద ఉన్నారు.

























Updated Date - 2020-11-14T03:47:54+05:30 IST