11 ఏళ్ల తర్వాత...

ABN , First Publish Date - 2020-12-09T04:42:04+05:30 IST

11 ఏళ్ల తర్వాత గండిపాళెం చెంచురామయ్య జలాశయం నుంచి దిగువకు నీరు విడుదలయ్యాయి.

11 ఏళ్ల తర్వాత...
క్రస్ట్‌ గేటు ద్వారా వదిలిన నీరు

గండిపాళెం జలాశయం నుంచి నీరు విడుదల



ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 8: 11 ఏళ్ల తర్వాత గండిపాళెం చెంచురామయ్య జలాశయం నుంచి దిగువకు నీరు విడుదలయ్యాయి. ఎగువ ప్రాంతం నుంచి 2700 క్యూసెక్కుల వరద వస్తుండగా, జలాశయ నీటిమట్టం 33.5 అడుగుల మేర ఉంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున మంగళవారం ఓ గేటు ఎత్తి 1200 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు ఇరిగేషన్‌ డీఈ రవి తెలిపారు. ఇన్‌ఫ్లో ఇంకా పెరగడంతో రాత్రికి మరో రెండు గేట్లు ఎత్తి పదివేల క్యూసెకులు కిందకు వదిలారు. 2009 తరువాత జలాశయం గేటు ఎత్తి నీరు కిందకు వదలడంతో రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  


సోమశిలకు పెరుగుతున్న ఇన్‌ఫ్లో


అనంతసాగరం : సోమశిల జలాశయానికి మంగళవారం 49,194 క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో డ్యాంలో 71.784 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. కండలేరుకు 600 క్యూసెక్కులు, నాలుగు గేట్లు ఎత్తి డెల్టాకు 54,600 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు వివరించారు.

Updated Date - 2020-12-09T04:42:04+05:30 IST