-
-
Home » Andhra Pradesh » Nellore » gandipalem
-
జలాశయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తా
ABN , First Publish Date - 2020-12-07T04:17:04+05:30 IST
ఉదయగిరి, వరికుంటపాడు మండలాలకు వరప్రసాదినిగా నిలిచిన గండిపాళెం జలాశయం అభివృద్ధి కి తన వంతు బాధ్యతగా ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం జ

ఉదయగిరి రూరల్, డిసెంబరు 6: ఉదయగిరి, వరికుంటపాడు మండలాలకు వరప్రసాదినిగా నిలిచిన గండిపాళెం జలాశయం అభివృద్ధి కి తన వంతు బాధ్యతగా ప్రభుత్వం నుంచి నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం జలాశయాన్ని సందర్శించి గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చారు. కాలువలు, తూములు మరమ్మతులకు గురైన నేపథ్యం లో తొలి విడతగా సమస్యను ముఖ్యమంత్రితో సహా ఇరిగేషన్ మంత్రి, జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి రూ.1.50 కోట్లు నిధులు మంజూరు చేయి స్తానన్నారు. మరో విడతగా పూర్తిస్థాయి మరమ్మతుల కోసం నిధులు తెచ్చే బాధ్యత తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్ర మంలో ఏఎంసీ చైర్మన్ షేక్ అలీఅహ్మద్, నాయకులు గుంటుపల్లి రామాంజనే యులు, అక్కి భాస్కర్రెడ్డి, మూలె సుబ్బారెడ్డి, మందలపు తిరుపతినా యుడు, భోగినేని శ్రీనివాసులు, ఇరిగేషన్ డీఈ రవి, ఏఈలు అంకులయ్య, విజయలక్ష్మి, రైతులు పాల్గొన్నారు.