ముగిసిన ఐసెట్‌

ABN , First Publish Date - 2020-09-12T10:44:51+05:30 IST

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి రెండు రోజులుగా జరుగుతున్న ఐసెట్‌ శుక్రవారంతో ముగిసింది

ముగిసిన ఐసెట్‌

రెండోరోజు 193 మంది గైర్హాజరు


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), సెప్టెంబరు 11 : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి రెండు రోజులుగా జరుగుతున్న ఐసెట్‌ శుక్రవారంతో ముగిసింది. రెండోరోజు  నెల్లూరు, గూడూరు నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాలలు, కావలి విశ్వోదయ కళాశాల, నార్త్‌ రాజుపాలెంలోని శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలల్లో పరీక్షలు జరిగాయి. 1883 మంది అభ్యర్థులకుగాను 193 మంది గైర్హాజరయ్యారు. కాగా, ఆదివారం నీట్‌ పరీక్షలు జరగనున్నందున ఆత్మకూరు బస్టాండు నుంచి ఉదయగిరి, కావలి ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను ప్రధాన బస్టాండు నుంచి నడుపుతున్నామని డిప్యూటీ సీటీఎం రవికాంత్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-12T10:44:51+05:30 IST