నిత్యావసరాల దుకాణాల ఏర్పాటు

ABN , First Publish Date - 2020-03-27T05:47:46+05:30 IST

పట్టణంలోని విశ్వోదయ జూనియర్‌ కళాశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల మైదానాల్లో నిత్యావసరాల దుకాణాలు ఏర్పాటు చేశారు. గుంపులు

నిత్యావసరాల దుకాణాల ఏర్పాటు

వెంకటగిరి(టౌన్‌), మార్చి 26: పట్టణంలోని విశ్వోదయ జూనియర్‌ కళాశాల, జడ్పీ ఉన్నత పాఠశాల, జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల మైదానాల్లో నిత్యావసరాల దుకాణాలు ఏర్పాటు చేశారు.  గుంపులు ఏర్పడకుండా బారికేడ్లు నిర్మించారు. తిరుపతి, గూడూరు, రాపూరు మార్గాల్లో ఎవరూ లోపలికి ప్రవేశించకుండా సీఐ అన్వర్‌ బాషా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. కలవలపూడిలో కల్లు విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎంపీడీవో సి. విజయలక్షి అక్కడకు వెళ్లి కల్లు ముంతలను పగుల గొట్టించారు. అనంతరం గ్రామాల్లో  బ్లీచింగ్‌ చల్లించి, మరో 20 రోజుల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. 

Updated Date - 2020-03-27T05:47:46+05:30 IST