మూడు మండలాల్లో రూ.18 కోట్ల విద్యుత్‌ బకాయిలు

ABN , First Publish Date - 2020-12-11T04:23:01+05:30 IST

కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని గ్రామ పంచాయతీలు రూ.18 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు బకాయి పడ్డాయని, వాటి వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని ట్రాన్స్‌కో అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఏడుకొండలు తెలిపారు.

మూడు మండలాల్లో రూ.18 కోట్ల విద్యుత్‌ బకాయిలు

కోట, డి సెంబరు 10 : కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని గ్రామ పంచాయతీలు రూ.18 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు బకాయి పడ్డాయని, వాటి వసూలుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని ట్రాన్స్‌కో అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఏడుకొండలు తెలిపారు. కోటలో గురువారం ఆయన మాట్లాడుతూ ఆయా మండలాల్లోని 62 పంచాయతీల్లో బకాయిలు పేరుకుపోయాయన్నారు. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 40 శాతం  బకాయిలకు జమ చేసుకోవాలన్న లక్ష్యం ఉన్నా, అధికారుల సహకారం లేని కారణంగా జాప్యం జరుగుతోందన్నారు. దీనిపై కూడా క్షేత్ర స్థాయిలో సమీక్షలు నిర్వహించనున్నామన్నారు. ఆయన వెంట పలువురు సబ్‌ ఇంజనీర్లు, లైన్‌మెన్‌ వున్నారు. 

Updated Date - 2020-12-11T04:23:01+05:30 IST