కంటైన్మెంట్ జోన్లలో అందరికీ కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2020-08-01T10:41:55+05:30 IST
కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారందరికీ కరోనా పరీక్షలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి ..

డీఎంహెచ్వో రాజ్యలక్ష్మి
నెల్లూరు(వైద్యం), జూలై 31: కంటైన్మెంట్ జోన్లలో ఉండే వారందరికీ కరోనా పరీక్షలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజ్యలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం డీఎంహెచ్వో కార్యాలయంలో వైదాధికారులతో ఆమె సమీక్షించారు. గ్రామ స్థాయిలో బృందాలు క్రియాశీలకంగా పనిచేయాలని, కరోనా బాధితులను, పాజిటివ్ కేసుల కాంటాక్టులను గుర్తించాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్లలో ఫివర్ క్లినిక్లు ఏర్పాటు చేయాలన్నారు. హోం క్వారంటైన్లో ఉండే వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏడీఎంహెచ్వో స్వర్ణలత, అధికారులు పాల్గొన్నారు.