కారు ఢీకొని జింక మృతి

ABN , First Publish Date - 2020-12-06T03:08:59+05:30 IST

వెంకటాచలం రైల్వే స్టేషన్‌ సమీపంలో సర్వేపల్లి మార్గంలో శనివారం కారు ఢీకొని జింక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే, వెంకటాచలం

కారు ఢీకొని జింక మృతి
జింక కళేబరం


వాహనంపై  చర్యలు శూన్యం

వెంకటాచలం, డిసెంబరు 5 : వెంకటాచలం రైల్వే  స్టేషన్‌ సమీపంలో సర్వేపల్లి మార్గంలో శనివారం కారు ఢీకొని జింక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే, వెంకటాచలం నుంచి ఇస్కపాళెం వైపు వెళ్తున్న ఓ కారు రోడ్డు దాటుతున్న జింకను ఢీకొంది. దీంతో జింక అక్కడికక్కడే మృతి చెందింది. అయితే కారు అతివేగంగా రావడం వల్లే జింక అక్కడికక్కడే మృతి చెందిందని అటుగా వెళ్తున్న పలువురు వాహనచోదకులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన జింక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం పశువైద్యశాలకు తరలించారు. అయితే ప్రమాదానికి కారణమైన వాహనంపై అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

-------


Updated Date - 2020-12-06T03:08:59+05:30 IST