మట్టి ప్రమీదలలో దీపాలు వెలిగించాలి

ABN , First Publish Date - 2020-11-14T02:43:26+05:30 IST

నియోజకవర్గ ప్రజలు పర్యావరణ రహితంగా దీపావళి పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆర్డీవో సువర్ణమ్మ, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. రమేష్‌బాబు పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఎస్‌ఆర్‌జేడీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు

మట్టి ప్రమీదలలో దీపాలు వెలిగించాలి

ఆత్మకూరు, నవంబరు 13 : నియోజకవర్గ ప్రజలు పర్యావరణ రహితంగా దీపావళి పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆర్డీవో సువర్ణమ్మ, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. రమేష్‌బాబు పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఎస్‌ఆర్‌జేడీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బాణసంచా విక్రయ దుకాణాలను వారు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దుకాణదారులు కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విక్రయాలు జరపాలని సూచించారు. ప్రతిఒక్కరూ మట్టి ప్రమీదలలో దీపాలు వెలిగించి పండుగ జరుపుకుంటే పర్యావరణ పరిరక్షణకు దోహదపడిన వారవుతారన్నారు. బాణసంచా పేల్చే సమయాల్లో చిన్నపిల్లల పట్ల జాగ్రత్తలు వహించాలని సూచించారు. వారి వెంట  ఈవోపీఆర్డీ సి.శ్రీనివాసులు ఉన్నారు. 

 

Updated Date - 2020-11-14T02:43:26+05:30 IST