దుకాణాలపై కొవిడ్ కేసులు
ABN , First Publish Date - 2020-08-11T10:25:26+05:30 IST
నెల్లూరులో నిబంధనలు పాటించని దుకాణాలపై నెల్లూరు కార్పొరేషన్ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.
నెల్లూరు (సిటీ), ఆగస్టు 10 : నెల్లూరులో నిబంధనలు పాటించని దుకాణాలపై నెల్లూరు కార్పొరేషన్ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. సోమవారం ట్రంకురోడ్డు, గాంధీబొమ్మ కూడలి, జీఎన్టీ రోడ్డు పరిధిలోని దుకాణాలను తనిఖీ చేశారు. లైసెన్సులు, ఎన్వోసీలు, శానిటేషన్ ధ్రువీకరణలు లేని వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించారు. అలాగే కొవిడ్-19 నిబంధనలు పాటించని, డస్ట్బిన్లు ఏర్పాటు చేయని వారిపై కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో పారిశుధ్య విభాగం కార్యదర్శులు పానేటి రాజేష్, అశోక్, గంగాధర్, బాలకృష్ణ, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.