22 కరోనా కేసుల నమోదు
ABN , First Publish Date - 2020-12-16T03:51:13+05:30 IST
జిల్లాలో కరోనా పాజిటవ్ కేసులు మంగళవారం 22 నమోదయ్యాయి.
నెల్లూరు (వైద్యం), డిసెంబరు 15 : జిల్లాలో కరోనా పాజిటవ్ కేసులు మంగళవారం 22 నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 63,397కి చేరింది. కొవిడ్ కారణంగా తాజాగా ఒకరు మృతి చెందారు. గత కొంత కాలంగా కరోనా కేసులు నమోదవుతున్నా ఎవరూ మృత్యువాత పడలేదు. ఇటీవల మళ్లీ బాధితులు మృతి చెందుతుండటం ఆందోళన కలిగించే అంశం. కాగా, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నారాయణ ఆసుపత్రులతోపాటు కొవిడ్కేర్ సెంటర్లలో చికిత్స పొందుతూ కోలుకున్న 36 మంది బాధితులను అధికారులు డిశ్చార్జ్ చేశారు.