పారేది జలం..తాగేది గరళం!

ABN , First Publish Date - 2020-12-11T05:52:32+05:30 IST

పట్టణంలో తాగునీరు కలుషితం అవుతున్నాయి. పలు వీధుల్లో మురుగు కాలువల్లో తాగునీటి పైపులు ఉన్నా యి.

పారేది జలం..తాగేది గరళం!
మురుగు కాలువలో పైపులైను

మురుగు కాలువల్లో పైపులు 

ప్రజారోగ్యానికి భద్రత కరువు

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 10: పట్టణంలో తాగునీరు కలుషితం అవుతున్నాయి.  పలు వీధుల్లో మురుగు కాలువల్లో తాగునీటి పైపులు ఉన్నా యి. కొన్నిచోట్ల పైపులు లీకులు కావడంలో అందులో మురుగు నీరు కలిసి వస్తోందని చెబుతున్నారు. ప్రధానంగా యూనియన్‌రోడ్డు, కోళ్లవీధి, చిన్నమసీదు తదితర ప్రాంతాల్లో కాలువల్లోనే తాగునీటి పైపులు ఉన్నాయి. ఒక్కోసారి ఆ పైపుల ద్వారా మురుగు నీరు సరఫరా అవుతోంది. ఇటీవల పంచాయతీ అధికారులు షామీర్సావీధి, కరీమావీధిల్లో మురుగు కాలువల్లో ఉన్న పైపులను బయటకు తీసి భూమిలో ఏర్పాటు చేశారు. పట్టణంలో అన్ని ప్రాంతాల్లో అలా చేస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-12-11T05:52:32+05:30 IST