భర్తలు వేధిస్తున్నారని ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-12-04T04:44:05+05:30 IST

తమను భర్తలు వేధిస్తున్నారంటూ ఇద్దరు మహిళలు గురువారం స్థానిక పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు.

భర్తలు వేధిస్తున్నారని ఫిర్యాదు

సూళ్లూరుపేట, డిసెంబరు 3 : తమను భర్తలు వేధిస్తున్నారంటూ ఇద్దరు మహిళలు గురువారం స్థానిక పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. డేగలపాళెంకు చెందిన యువతితో అదే ప్రాంతానికి చెందిన కారు డ్రైవర్‌ దినకర్‌కు ఈ ఏడాది జూన్‌లో వివాహం జరిగింది. తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని తల్లిదండ్రులతో కలిసి తనను  వేధిస్తున్నాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. మన్నారుపోలూరుకు చెందిన యువతి వైజాగ్‌కు చెందిన సతీష్‌ కుమార్‌ను కొంత కాలం క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.  తన భర్త,  అతని అక్క, అత్త రూ. 10 లక్షలు కట్నం తెమ్మని వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. కులం పేరుతో దూషిస్తున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొంది.


Updated Date - 2020-12-04T04:44:05+05:30 IST