స్థానిక ఎన్నికలు నిర్వహించే ధైర్యం ప్రభుత్వానికి లేదు

ABN , First Publish Date - 2020-12-08T01:37:06+05:30 IST

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం వైసీపీ ప్రభుత్వానికి లేదని జడ్పీ మాజీ చైర్మన్‌, టీడీపీ నేత చెంచలబాబు యాదవ్‌ విమర్శించారు.

స్థానిక ఎన్నికలు నిర్వహించే ధైర్యం ప్రభుత్వానికి లేదు

జడ్పీ మాజీ చైర్మన్‌ చెంచలబాబు యాదవ్‌

నెల్లూరు(వైద్యం), డిసెంబరు 7 : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం వైసీపీ ప్రభుత్వానికి లేదని జడ్పీ మాజీ చైర్మన్‌, టీడీపీ నేత చెంచలబాబు యాదవ్‌ విమర్శించారు. సోమవారం నెల్లూరులోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, హైదరాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో కరోనా సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం వ్యతిరేకిస్తోందన్నారు. ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగాల్సిన సమయంలో టీడీపీ ఎంపీటీసీ, జడ్పీటీసీ అఽభ్యర్థులను భయపెట్టి చాలాచోట్ల  ఏకగ్రీవం చేసుకున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల నోటిఫికేషన్‌ రద్దు చేసి తాజాగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో నాయకులు రసూల్‌, సుమన్‌, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-08T01:37:06+05:30 IST