మొగళ్లపాళెంలో గేదేలు మృతి

ABN , First Publish Date - 2020-11-27T06:22:35+05:30 IST

మండల పరిధిలోని సౌత్‌మోపూరు పంచాయతీ మొగళ్లపాళెంలో తాజా వర్షాలకు హెచ్‌ఎస్‌ (పచ్చికదొమ్మ) వ్యాధి సోకి 5 గేదెలతోపాటు 4 దూడలు మృత్యువాతపడ్డాయి.

మొగళ్లపాళెంలో గేదేలు మృతి
మొగళ్లపాళెంలో మృతి చెందిన గేదె

నెల్లూరు రూరల్‌, నవంబరు 26 : మండల పరిధిలోని సౌత్‌మోపూరు పంచాయతీ మొగళ్లపాళెంలో తాజా వర్షాలకు హెచ్‌ఎస్‌ (పచ్చికదొమ్మ) వ్యాధి సోకి 5 గేదెలతోపాటు 4 దూడలు మృత్యువాతపడ్డాయి. వర్షాలకు పచ్చి గడ్డిలో హెచ్‌ఎస్‌ బ్యాక్టీరియా వృద్ధి చెంది దానిని తినడం వల్ల ఇవి మరణించినట్లు వైద్యులు తేల్చారు. ఆమంచర్ల పశువైద్యశాల డాక్టర్‌ మహేంద్ర మొగళ్లపాళెం చేరుకుని మృతి చెందిన గేదేలను పరిశీలించారు. వాటన్నిటికి ఇటీవల వ్యాక్సిన్‌ చేశామని, కానీ వర్షాల కారణంగా మరణించినట్లు చెప్పారు. 

Updated Date - 2020-11-27T06:22:35+05:30 IST