సోమిరెడ్డి, నారాయణతో అజీజ్‌ భేటీ

ABN , First Publish Date - 2020-09-30T12:01:12+05:30 IST

తెలుగు దేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ మంగళారం ..

సోమిరెడ్డి, నారాయణతో అజీజ్‌ భేటీ

నెల్లూరు(వ్యవసాయం), సెప్టెంబరు 29 : తెలుగు దేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు  నియోజకవర్గం అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ మంగళారం హైదరాబాద్‌లో మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పొంగూరు నారాయణను  మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేసి ముందు నడిపించేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. 


నెల్లూరు పార్లమెంటు  నియోజకవర్గం అధ్యక్షుడిగా అజీజ్‌ను నియమించినందుకు మంగళవారం నెల్లూరులో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నగర విభాగం నాయకులు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నగర అధ్యక్షుడు ఆషిక్‌ అలీ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీలో 50శాతం బీసీలకు కేటాయించిన ఏకైక పార్టీ టీడీపీ అని కొనియాడారు. మైనార్టీలకు ఉన్నతమైన పదవి ఇవ్వడం హర్షదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి సుకేశ్‌, పార్ధు, బద్రి, సంజయ్‌ తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2020-09-30T12:01:12+05:30 IST