ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-12-06T03:00:07+05:30 IST
హసనాపురంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఫిట్టర్ ట్రేడ్లో ఖాళీలు ఉండడంతో మూడో విడత కౌన్సెంలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు.

ఏఎస్ పేట, డిసెంబరు 5: హసనాపురంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ఫిట్టర్ ట్రేడ్లో ఖాళీలు ఉండడంతో మూడో విడత కౌన్సెంలింగ్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 12వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులు చేసుకున్నా వారు అఫ్లికేషన్ కాపీ, ఒరిజినల్ సర్టిఫికెట్స్లతో 15వ తేది ఉదయం 10గంటలకు హాజరు కావలని తెలిపారు.